అర్చకులపై దాడి.. వైసీపీ దౌర్జన్యకాండకు నిదర్శనం

ABN , First Publish Date - 2020-12-02T06:34:21+05:30 IST

లాక్‌డౌన్‌లో దాదాపు 8 నెలలపాటు ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటించిన అర్చకులపై కర్నూల్‌ జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారేశ్వర ఆలయ చైర్మన్‌ భౌతికదాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.

అర్చకులపై దాడి.. వైసీపీ దౌర్జన్యకాండకు నిదర్శనం
సమావేశంలో మాట్లాడుతున్న బొండా ఉమా

పాయకాపురం, డిసెంబరు 1 : లాక్‌డౌన్‌లో దాదాపు 8 నెలలపాటు ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటించిన అర్చకులపై కర్నూల్‌ జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారేశ్వర ఆలయ చైర్మన్‌ భౌతికదాడికి పాల్పడటం దుర్మార్గమైన చర్య అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. స్థానిక మొగల్రాజపురంలోని తన నివాసంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్చకులను గర్భాలయం ముందే విచక్షణారహితంగా కొట్టడం అనాగరిక చర్య అని, ఈ దాడిపై ఈవో, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వైసీపీ నేతల దౌర్జన్యకాండకు నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి పూజారు లపై దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరిపి, దోషుల ను కఠినంగా శిక్షించాలని ఉమా డిమాండ్‌ చేశారు. గండూరి మహేష్‌, ప్ర యాగ కృష్ణ, జీ విజయ్‌, చలమలశెట్టి శ్రీను, శివయ్య, నిర్మలమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T06:34:21+05:30 IST