పల్లె వెలుగు చార్జీలు పెంచిన మొదటి తుగ్లక్ జగన్ రెడ్డే: Bonda Uma

ABN , First Publish Date - 2022-07-02T18:36:24+05:30 IST

సీఎం జగన్ రెడ్డి(CM Jagan) మూడేళ్ల ఏళ్ల పాలనలో ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచారని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమ(Bonda Uma) పేర్కొన్నారు.

పల్లె వెలుగు చార్జీలు పెంచిన మొదటి తుగ్లక్ జగన్ రెడ్డే: Bonda Uma

Amaravathi : సీఎం జగన్ రెడ్డి(CM Jagan) మూడేళ్ల ఏళ్ల పాలనలో ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచారని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమ(Bonda Uma) పేర్కొన్నారు. పల్లె వెలుగు చార్జీలు పెంచిన మొదటి తుగ్లక్ జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu) ఆర్టీసీ చార్జీలు ఎప్పుడూ పెంచలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల ఆర్టీసీ ప్రయాణికులపై భారం మోపారని బోండా ఉమ విమర్శించారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అని ఉద్యోగులను కనీస సదపాయాలు లేకుండా చేశాడన్నారు. ఆర్టీసీ ఆస్తులను కొట్టేయటానికి వైసీపీ అన్ని ప్రయత్నాలను చేస్తోందన్నారు. ఆర్టీసీ చార్జీలు తగ్గించే వరకూ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తుందని బోండా ఉమ పేర్కొన్నారు.


Updated Date - 2022-07-02T18:36:24+05:30 IST