ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది: బోండా ఉమ
ABN , First Publish Date - 2022-02-08T17:58:07+05:30 IST
ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు.
విజయవాడ: ఉద్యోగులను వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, రిటైర్మెంట్ వయసు పెంచడం, పన్షనర్ల విషయంలో సర్కార్ మోసం చేసిందన్నారు. ఉద్యోగులకు మంచి జరగాలనే తాము కోరుకుంటున్నామని, ఈ విషయంలో వారికి అండగా ఉంటామని బోండా ఉమ స్పష్టం చేశారు.