రాబోయే ఎన్నికల్లో బూత్‌ కమిటీలే కీలకం: యనమల

ABN , First Publish Date - 2022-05-16T06:46:20+05:30 IST

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి బూత్‌ కమిటీలే కీలకమని తుని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, పరిశీలకుడు యనమల కృష్ణుడు అన్నారు.

రాబోయే ఎన్నికల్లో బూత్‌ కమిటీలే కీలకం: యనమల

రాజోలు, మే 15: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి బూత్‌ కమిటీలే కీలకమని తుని నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి, పరిశీలకుడు యనమల కృష్ణుడు అన్నారు. తాటిపాకలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఆదివారం జరిగిన రాజోలు నియోజకవర్గ టీడీపీ బూత్‌ కమిటీ క్లస్టర్లు, యూనిట్‌ ఇన్‌చార్జిల సమావేశానికి ఆయన పరిశీలకుడిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ టీడీపీలో కీలక బాధ్యులుగా ఉన్న బూత్‌ కమిటీ కన్వీనర్లు ప్రతి ఇంటికీ తిరిగి సర్వే చేయాలని పిలుపునిచ్చారు.  మాజీ మంత్రి గొల్లపల్లి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో బూత్‌ కమిటీలకు కీలక బాధ్యతలు ఉన్నాయన్నారు. తొలుత వియ్యూరువారిమెరకలో జనసేన పార్టీ తరుపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన అనిశెట్టి నరసింహారావు గొల్లపల్లి సమక్షంలో టీడీపీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కేతా శ్రీను, రాజోలు నియోజకవర్గ బూత్‌ కోఆర్డినేటర్‌ చాగంటి స్వామి, బూత్‌ క్టస్లర్లు ముప్పర్తి నాని, చెల్లింగి లీలామోహనశ్రీనివాస్‌, కోళ్ల జయేంద్రకృష్ణ, అడబాల యుగంధర్‌, కట్టా వెంకటరమణ, బత్తుల రవీంద్రనాథ్‌, కసుకుర్తి త్రినాథస్వామి, గుబ్బల శ్రీనివాస్‌, తాడి సత్యనారాయణ, పిండి సత్యనారాయణ పాల్గొన్నారు. 



Updated Date - 2022-05-16T06:46:20+05:30 IST