మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలి: బొప్పరాజు
ABN , First Publish Date - 2021-03-06T20:31:09+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అమరావతి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
ఏలూరు: ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అమరావతి ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ జేఏసీ అమరావతి మహిళ విభాగం అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఏలూరులో ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలకు రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ హాజరవుతారన్నారు. గుంటూరు, విజయవాడ, పశ్చిమ గోదావరిలో మహిళ ఉద్యోగులకు క్రీడ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతులు తీసుకున్నామన్నారు. ఏడాదికి మహిళలకు ఐదు రోజులు సెలవు దినాలు ప్రకటించాలని సీఎం జగన్ను కోరతామని చెప్పారు.