Bopparaju: 15, 20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదు..

ABN , First Publish Date - 2022-08-28T20:16:55+05:30 IST

గతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశామని, ఇప్పుడు జీతాల కోసం...

Bopparaju: 15, 20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదు..

ప్రకాశం జిల్లా (Prakasam dist.): గతంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేశామని, ఇప్పుడు జీతాల కోసం ఉద్యమం చెయ్యాల్సి వస్తోందని, భయమేస్తుందని ఏపీ జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల 15, 20 తారీకుల వరకూ జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా... ప్రవేటు ఉద్యోగం మేలు అన్న పరిస్థితులు వస్తాయన్నారు. సీపీఎస్ (CPS) రద్దు కోసం ఏడేళ్లుగా ఉద్యోగులు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందన్నారు. అందులో భాగంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 1న సీపీఎస్ రద్దు కోరుతూ నిరసన కార్యక్రమం ఉద్యోగులు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని, శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు ఉద్యోగులు పిలుపునిచ్చారన్నారు. ఉద్యోగులను నిర్భంధం చేసే కొద్దీ వారిలో కసి పెరుగుతుందన్నారు. సీపీఎస్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కరించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-08-28T20:16:55+05:30 IST