బోసిపోయిన వైసీపీ ప్లీనరీ
ABN , First Publish Date - 2022-06-26T08:36:49+05:30 IST
బోసిపోయిన వైసీపీ ప్లీనరీ
పాతపట్నంలో సభ ప్రారంభానికి ముందే బయటికొచ్చేసిన మహిళలు
మెళియాపుట్టి/పాతపట్నం, జూన్ 25: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో శనివారం వైసీపీ నాయకులు నిర్వహించిన ప్లీనరీ జనాలు లేక బోసిపోయింది. ఈ సమావేశంలో ఆహ్వానితుల కోసం వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొంటారని ప్రకటించారు. కానీ, వారు రాలేదు. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదా్సతోనే సభను ‘మమ’ అనిపించారు. కాగా, ధర్మాన ప్రసంగం ప్రారంభం కాక ముందే ప్లీనరీకి వచ్చిన మహిళలు వెనుదిరిగారు. ఎంత నచ్చజెప్పినా.. ‘మీ ప్రసంగాలకోదండం’ అంటూ వెళ్లిపోయారు. దీంతో సభ ముందు కుర్చీలన్నీ ఖాళీ అయ్యాయి. ఈ పరిస్థితిని చూసిన నేతలు అవాక్కయ్యారు.