విశాఖ ఎన్సీసీ భూముల వివాదంపై బొత్స వివరణ
ABN , First Publish Date - 2022-04-05T22:06:10+05:30 IST
విశాఖ ఎన్సీసీ భూముల వివాదంపై బొత్స వివరణ
విశాఖ: నగర ఎన్సీసీ భూముల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. తప్పు చేసిన టీడీపీనే ధర్నా చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఎన్సీసీ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. స్టాంప్ డ్యూటీ తక్కువ చెల్లించారన్నదానిపై విచారణ జరిగిందన్నారు. టీడీపీకి ఎలాంటి సందేహాలు ఉన్నా తీరుస్తామని ఆయన అన్నారు. ఎన్సీసీ భూముల్లో 16శాతం ప్రభుత్వ వాటా ఉందన్నారు. గత ప్రభుత్వం ఒప్పందం రద్దు చేయాలనుకుందని, 2014లో హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందన్నారు.