JAGAN : పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-07-19T18:38:46+05:30 IST

పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

JAGAN : పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి బొత్స

అమరావతి: పిల్లలను గ్లోబల్ స్టూడెంట్లు(Global students)గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM JAGAN) లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) వ్యాఖ్యానించారు. మంగళవారం ‘‘మన బడి - నాడు నేడు’’ లో భాగంగా సత్యనారాయణపురంలోని ఓ ఉన్నత పాఠశాలలో 44 లక్షలతో అదనపు తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ధిల్లీ రావు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33 కోట్లతో 28 ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ... ‘‘సీఎం జగన్ చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు ఉండాలి. నూతన జాతీయ విద్యా విధానం అమలు చేస్తున్నాం.‘‘మన బడి - నాడు నేడు’’ ద్వారా ఈ ఏడాది 8 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. నూతన విద్యా విధానం ద్వారా అంగన్వాడీ‌ల్లో 1,2 తరగతులు చెప్పే స్కూల్ టీచర్లు అందులో ఉంటారు. గతంలో ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్‌లను బోధించేవారు. ఈ అకడమిక్ సంవత్సరం నుంచి మూడోతరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉంటారు.  పాఠశాలల్లో కొన్ని లోపాలను సరిదిద్దుతున్నాం.. భావి తరాలు మరింత అభివృద్ధి చెందాలి. పిల్లల చదువుల పట్ల రాజకీయాలు చేయడం మానుకోవాలి.. తల్లిదండ్రులు వారి ధ్యాసలో పడకుండా పిల్లల అభివృద్ధికి సహకరించాలి.కేరళ తరహాలో విద్యార్థులు ఉన్నత విద్యనందిపుచ్చుకొని రాణించాలనేదే ప్రభుత్వ లక్ష్యం’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-19T18:38:46+05:30 IST