ధాన్యం దొంగలించాడని బాలుడిని చితకబాది.. గుండు గీసిన యజమానులు..
ABN , First Publish Date - 2022-05-01T07:39:49+05:30 IST
ఆ బాలుడు ధాన్యం దొంగిలించాడని వర్తకులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తామే శిక్షను అమలు చేశారు.. బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారు.. బట్టలు చింపేశారు.. అతడికి గుండు గీశారు...
ఆ బాలుడు ధాన్యం దొంగిలించాడని వర్తకులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తామే శిక్షను అమలు చేశారు.. బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టారు.. బట్టలు చింపేశారు.. అతడికి గుండు గీశారు. ఆ మొత్తం వ్యవహారాన్ని మొబైల్లో వీడియో తీశారు. తాలిబాన్ల తరహాలో శిక్షించిన ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
మధ్యప్రదేశ్లోని మధుసూదన్ గర్ వ్యవసాయోత్పత్తి మార్కెట్లో కూలీగా పనిచేస్తున్న ఒక బాలుడు ధాన్యం దొంగిలించాడని కొందరు వర్తకులు ఆరోపించారు. న్యాయన్యాయాలు విచారణ చేయకుండా ఆ బాలుడిని శిక్షించారు. మార్కెట్లోనే అతడి చేతులు, కాళ్లు కట్టేసి కొట్టి, బట్టలు చింపేశారు. అనంతరం గుండు గీశారు. ఆ ఘటన మొత్తాన్ని మొబైల్లో వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ఘటనపై పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఆ బాలుడు నిజంగా దొంగతనం చేశాడా? లేదా? అని ఆరా తీస్తున్నారు. వీడియో ఆధారంగా ఇప్పటికే నిందితులను గుర్తించారు. మార్కెట్లో అందర్నీ ఆ ఘటన గురించి ప్రశ్నిస్తున్నారు. బాధిత బాలుడికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.