ప్రియురాలి ఇంటి ముందే ప్రాణాలు విడిచిన ప్రియుడు.. అసలు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-15T18:04:40+05:30 IST

ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు.. ఆమె పేరును తన గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు.

ప్రియురాలి ఇంటి ముందే ప్రాణాలు విడిచిన ప్రియుడు.. అసలు ఏం జరిగిందంటే..

ఆ యువకుడు ఓ అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు.. ఆమె పేరును తన గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు.. ప్రియురాలిని కలిసేందుకు ఇటీవల ఆమె ఇంటికి వెళ్లాడు.. అయితే ఏం జరిగిందో తెలియదు.. ఆమె ఇంటి ముందుకు వెళ్లగానే కుప్పకూలిపోయాడు.. వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన మధ్యప్రదేశ్‌ లోని సాగర్‌ జిల్లాలో జరిగింది. 


సాగర్ జిల్లాలోని చిరాయ్ గ్రామానికి చెందిన శ్రీరామ్ అనే వ్యక్తి దుగ్‌సర గ్రామానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. శ్రీరామ్ తన ఛాతీపై ప్రియురాలి పేరును పచ్చబొట్టు కూడా వేసుకున్నాడు. తన ప్రియురాలిని కలిసేందుకు శ్రీరామ్ గురువారం ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె ఇంటి ముందుకు వెళ్లగానే కుప్పకూలిపోయాడు. వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి శ్రీరామ్‌ను అలా చూసి షాకైంది. 


ఆ యువతి కుటుంబ సభ్యులు శ్రీరామ్‌ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీరామ్ మరణించాడు. శ్రీరామ్ మృతికి కారణాలేంటనేది ఇంకా తెలియలేదు. గుండెపోటు వచ్చిందని కొందరు భావిస్తున్నారు. లేదా  విషం తాగి చనిపోయి ఉంటాడని కొందరు అనుకుంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీరామ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. 

Updated Date - 2022-04-15T18:04:40+05:30 IST