స్మార్ట్‌ఫోన్ చోరీ చేసిన బాలుడు... ఆ తర్వాత...

ABN , First Publish Date - 2020-09-22T03:19:43+05:30 IST

కరోనా నేపధ్యంలో... ‘ఆన్‌లైన్’ తరగతులను స్మార్ట్ గా వినొచ్చనే ఉద్దేశంతో ... ఓ బాలుడు... ఇద్దరు క్రిమినల్స్‌‌తో చేతులు కలిపాడు. కాగా... స్మార్ట్ ఫోన్ చోరీ కేసులో పట్టుబడిన బాలుడి పరిస్థితి నేపధ్యంలో... ఓ పోలీస్ ఆధికారి... తన సొంత డబ్బుతో ఓ స్మార్ట్ ఫోన్ కొని ఆ బాలుడికి బహుమతిగా ఇచ్చాడు. చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది.

స్మార్ట్‌ఫోన్ చోరీ చేసిన బాలుడు... ఆ తర్వాత...

చెన్నై :  కరోనా నేపధ్యంలో... ‘ఆన్‌లైన్’ తరగతులను స్మార్ట్‌గా వినొచ్చనే ఉద్దేశంతో ... ఓ బాలుడు... ఇద్దరు క్రిమినల్స్‌‌తో చేతులు కలిపాడు. కాగా... స్మార్ట్ ఫోన్ చోరీ కేసులో  పట్టుబడిన బాలుడి పరిస్థితి నేపధ్యంలో... ఓ పోలీస్ ఆధికారి... తన సొంత డబ్బుతో ఓ స్మార్ట్ ఫోన్ కొని ఆ బాలుడికి బహుమతిగా ఇచ్చాడు. చెన్నైలో  ఈ ఘటన చోటుచేసుకుంది.


కాగా... పదమూడేళ్ల  ఆ విద్యార్థి... భవిష్యత్తులో మళ్ళీ చోరీల బాట పట్టకుండా చేయూతనిచ్చిన ఆ పోలీస్ అధికారిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలిలా ఉన్నాయి. చెన్నైలోని ఓ కార్పొరేషన్ స్కూల్లో  చదువుతున్న ఆ విద్యార్థిని... పేదరికం ఆన్‌లైన్ తరగతులకు దూరం చేసింది. తండ్రి ఓ బిస్కట్ దుకాణంలో పని చేస్తుండగా, తల్లి ఇళ్లలో పాచిపని చేసుకుంటోంది.


తమ కుమారుడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చేంత శక్తిఈ దంపతులకు లేకపోయింది. దీనిని అవకాశంగా భావించిన ఇద్దరు క్రిమినల్స్... ఆ బాలుడికి మాయమాటలు చెప్పి తమ బ్యాచ్‌లో కలిపేసుకున్నారు. ఈ క్రమంలో ఓ స్మార్ట్ ఫోన్ చోరీ కేసులో ఆ బాలుడు ఇరుక్కున్నాడు. కాగా... ఆ బాలుడి పరిస్థితి గురించి అనుకోకుండా తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి... ఆ నేరస్తుల బారి నుంచి ఆ బాలుడిని రక్షించారు.

Updated Date - 2020-09-22T03:19:43+05:30 IST