పార్వతీదేవిగా బోయకొండ గంగమ్మ
ABN , First Publish Date - 2022-09-29T06:00:22+05:30 IST
దసరా మహోత్సవాల్లో రెండో రోజైన బుధవారం బోయకొండ గంగమ్మ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా మహోత్సవాల్లో రెండో రోజైన బుధవారం బోయకొండ గంగమ్మ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి అమ్మవారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. రెండు చేతుల్లో కమలాలు, ఒక చేతిలో శివలింగం, మరో చెయ్యి అభయ హస్తంగా చతుర్భుజాలుగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అద్దాల మండపం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి హోమం చేశారు. ఉభయదారులకు అమ్మవారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ చైర్మన్ శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
- చౌడేపల్లె