దుర్గాదేవిగా బోయకొండ గంగమ్మ

ABN , First Publish Date - 2022-10-04T05:13:16+05:30 IST

దసరా మహోత్సవంలో భాగంగా బోయకొండ గంగమ్మ సోమవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.

దుర్గాదేవిగా బోయకొండ గంగమ్మ
అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి పెద్దిరెడ్డి

దసరా మహోత్సవంలో భాగంగా బోయకొండ గంగమ్మ సోమవారం దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రెండు చేతులలో శంఖు చక్రాలు, మరో రెండు చేతులలో విల్లంబులు, చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో త్రిశూలం, అష్ట భుజాలతో అమ్మవారిని అలంకరించారు. స్వర్ణాభరణాలతో దుర్గాదేవిగా, పులిపై అమ్మవారిని అధిష్ఠింపచేశారు. దీప, ధూప నైవేద్యం సమర్పించారు. అమ్మవారి అద్దాల మండపం వద్ద ఉత్సవమూర్తిని అలంకరించి, కలశ స్థాపన చేసి ప్రత్యేకంగా అలంకరించారు. మహా గణపతి, ఆదిత్యాధి నవగ్రహ, దుర్గ చండీ, మృత్యుంజయేశ్వర, రుద్ర  హోమాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, ఈవో చంద్రమౌళి మంత్రికి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

- చౌడేపల్లె

Updated Date - 2022-10-04T05:13:16+05:30 IST