జనగణనను బహిష్కరిస్తాం: నటుడు సుమన్‌

ABN , First Publish Date - 2021-11-07T21:32:52+05:30 IST

కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని నటుడు, ఏపీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుమన్‌ ప్రకటించారు.

జనగణనను బహిష్కరిస్తాం: నటుడు సుమన్‌

చిత్తూరు: కేంద్రప్రభుత్వం కులగణన చేయకపోతే జనగణనను బహిష్కరిస్తామని నటుడు, ఏపీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సుమన్‌ ప్రకటించారు. చిత్తూరు నుంచి కాణిపాకం వరకు బీసీలు శంఖారావం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ పాదయాత్రలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులగణనపై ఆరు రాష్ట్రాలు తీర్మానం చేశాయని, 20 రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయని తెలిపారు. వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి బీసీల హక్కులపై తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీసీల అంటే కేంద్రానికి లెక్క లేకుండా పోయిందని, కుల గణన ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్‌ను నెరవేర్చకుంటే రానున్న పార్లమెంటును ముట్టడి చేస్తామని సుమన్ హెచ్చరించారు. 

Updated Date - 2021-11-07T21:32:52+05:30 IST