లండన్లో భారతీయ సంతతి యువతి మృతి.. బాయ్ఫ్రెండ్పై హత్యా నేరం మోపిన పోలీసులు !
ABN , First Publish Date - 2022-03-23T01:36:26+05:30 IST
లండన్లో ఇటీవల హత్యకు గురైన భారతీయ సంతతి యువతి కేసులో నిందితుడిగా ఉన్న ఆమె బాయ్ఫ్రెండ్పై స్థానిక పోలీసులు హత్యా నేరం మోపారు.
ఎన్నారై డెస్క్: లండన్లో ఇటీవల హత్యకు గురైన భారతీయ సంతతి యువతి కేసులో నిందితుడిగా ఉన్న ఆమె బాయ్ఫ్రెండ్పై స్థానిక పోలీసులు హత్యా నేరం మోపారు. మంగళవారం నాడు నిందితుడిని స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. క్లర్కెన్వెల్ ప్రాంతంలోగల విద్యార్థి నివాసముదాయాల్లోని తన గదిలో సబితా థన్వాల్ శనివారం అచేతంగా పోలీసులకు లభ్యమైన విషయం తెలిసిందే. అప్పటికే ఆమె మృతి చెందినట్టు పోలీసులు ధృవీకరించారు. ఈ క్రమంలో.. మృతురాలి బాయ్ఫ్రెండ్, ట్యూనీషియాకు చెందిన మెహెర్ మారూఫ్ను అరెస్టు చేశారు. ఇక మెడపై బలమైన గాయం కావడంతో ఆమె మృతి చెందినట్టు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. దీంతో.. పోలీసులు నిందితుడు మెహెర్పై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
కాగా.. సోమవారం నాడు సబితాకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు తుది వీడ్కోలు పలికారు. నిందితుడు కొంత కాలంగా సబితతో సంబంధం కొనసాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు విద్యార్థి కాదని, అతడికి శాశ్వత చిరునామా ఏదీ లేదని కూడా పేర్కొన్నారు. మృతురాలు యూనివర్శిటీ ఆఫ్ లండన్లో సైకాలజీ చదువుతుండేవారు. కాగా.. పోలీసుల దరఖాస్తుకు తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామని యూనివర్శిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు.