అతడికి 45 ఏళ్లు.. ఆమెకు 44 ఏళ్లు.. ఊరి చివర పొలాల్లో నిర్జీవంగా.. పక్కనే తుపాకీ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-16T01:04:34+05:30 IST

అతడికి 45 ఏళ్లు.. ఆమె వయసు 44 ఏళ్లు.. వారిద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు..

అతడికి 45 ఏళ్లు.. ఆమెకు 44 ఏళ్లు.. ఊరి చివర పొలాల్లో నిర్జీవంగా.. పక్కనే తుపాకీ.. అసలేం జరిగిందంటే..

అతడికి 45 ఏళ్లు.. ఆమె వయసు 44 ఏళ్లు.. వారిద్దరూ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహమైంది.. పిల్లలు కూడా ఉన్నారు.. శుక్రవారం ఉదయం ఆ మహిళ పని కోసం బయటకు వెళ్లింది.. అక్కడకు తుపాకీ పట్టుకుని వచ్చిన ప్రియుడు ఆమెను కాల్చాడు.. దీంతో ఆ మహిళ నొప్పితో కేకలు పెట్టింది.. ఆమెను పట్టుకుని అతను కూడా ఏడ్చాడు.. ఆ తర్వాత మరోసారి కాల్చి ఆమెను చంపేశాడు.. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

ప్రియురాలిపై అత్యాచారం చేసి జైలుకెళ్లిన యువకుడు.. అతడిని మళ్లీ కలిసేందుకు ఆమె ఎలాంటి స్కెచ్ వేసిందంటే..


మీరట్‌లోని దుర్వేష్‌పూర్ గ్రామానికి చెందిన కిరణ్ పాల్ (45) అనే వ్యక్తికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతన పదేళ్ల క్రితం మిథ్లేష్ (44) అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ తరచుగా కలుసుకునేవారు. రోజు కూలీగా పని చేసే మిథ్లేష్  శుక్రవారం ఉదయం పని కోసం వెళ్లింది. అక్కడకు కిరణ్ పాల్ ఓ తుపాకీ పట్టుకుని వెళ్లాడు. `మిథ్లేష్ మనిద్దరం కలిసి బతకలేం` అంటూ తుపాకీతో కాల్చాడు. దీంతో ఆమె కుప్పకూలిపోయింది. 


బాధతో కేకలు పెట్టింది. ఆమెను పట్టుకుని కిరణ్ పాల్ కొద్దిసేపు ఏడ్చాడు. ఆ తర్వాత మరో బుల్లెట్‌తో ఆమెను చంపేశాడు. ఆ తర్వాత తన కణతల మీద కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. 

Updated Date - 2022-07-16T01:04:34+05:30 IST