పెళ్లి వాయిదా వేస్తున్న ప్రియుడు
ABN , First Publish Date - 2021-01-25T06:30:56+05:30 IST
ప్రేమించి పెళ్లికి వాయిదా వేస్తున్న ప్రియుడిపై ప్రియురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రియుడిని ఒప్పించి పెళ్లి జరిపించారు.
ఒప్పించి పెళ్లి చేసిన పోలీసులు
గుర్రంపోడు, జనవరి 24: ప్రేమించి పెళ్లికి వాయిదావేస్తున్న ప్రియుడిపై ప్రియురాలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రియుడిని ఒప్పించి పెళ్లి జరిపించారు. ఎస్ఐ సైదులు తెలి పిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రపోడు మండలం గాసీరాంతండాకు చెందిన జటావత్ మునేష్, మేఘావత్ శాంతి ఆరేళ్లుగా ప్రేమించు కుంటున్నారు. ఏడాది కాలంగా శాంతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగ మునేష్ వాయిదాలు వేస్తూ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. దీంతో శాంతి గ్రామ పెద్దల్లో పంచాయతీ పెట్టిం చింది. అయినా ముకేష్ వినకపోవడంతో గ్రామ పెద్దల సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు ఇద్దరు మేజర్లు కావడంతో మునేష్ను పెళ్లికి ఒప్పించారు. పెద్ద మనుషుల సమక్షంలో స్టేషన్లో దండులు మార్పించి అనంతరం స్థానిక వెంకటేశ్వర ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించారు. కార్యక్ర మంలో గ్రామ సర్పంచ్ దత్రునాయక్ మంగ్లా, పాండు, భాస్కర్, శ్రీను పాల్గొన్నారు.