కృష్ణా జిల్లా మద్దులపర్వలో విషాదం
ABN , First Publish Date - 2021-04-11T23:48:01+05:30 IST
కృష్ణా జిల్లా మద్దులపర్వలో విషాదం
కృష్ణా: రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో విషాదం చోటు చేసుకుంది. అడవి కొత్తూరు నూజివీడు బ్రాంచ్ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన నలుగురు కూలీలు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానికులు రక్షించారు. మరో ఇద్దరు మృతి చెందారు. మృతులు నూజివీడు మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన వారి గుర్తించారు. మామిడి కోతకు వెళ్ళి వస్తుండగా కూలీలు కాలువలో ఈతకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. వాసు (22), వేణు (24) మృతి చెందినట్లు చెప్పారు.