నిపానిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-01-17T06:35:02+05:30 IST
మండలంలోని నిపాని గ్రామంలోని శ్రీవేంకటేశ్వ ర ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి.
భీంపూర్, జనవరి 16: మండలంలోని నిపాని గ్రామంలోని శ్రీవేంకటేశ్వ ర ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పద్మావతి, వేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం శోభాయాత్ర నిర్వహించారు. మహా అన్నదానంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాగా, స్వామివారి వేడుకలకు ఎంపీ సోయం బాపురావ్ హాజరయ్యారు. ఇందు లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, టీటీడీ బోర్డు సభ్యుడు బొజ్జంకి అనిల్కుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్, జడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీ కుడ్మెత రత్నప్రభ, సర్పంచ్ భూమన్నదొర, తదితరులున్నారు.