ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు
ABN , First Publish Date - 2022-05-27T09:03:54+05:30 IST
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి) : నిజమైన పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పేద బ్రాహ్మణులకోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేసిందని
- ప్రభుత్వ నిర్ణయాలవల్లే అగ్రవర్ణ పేదలకు సదుపాయాలు
- శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి) : నిజమైన పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా పేద బ్రాహ్మణులకోసం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఏర్పాటు చేసిందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్లే అగ్రవర్ణ పేదలకు సదుపాయాలు అందుతున్నాయని ఆయన అన్నారు. బ్రాహ్మణ పరిషత్తు కార్యక్రమాలను తాము కూడా అమలుచేయాలని ఇతర కార్పొరేషన్లు ఆలోచనలు చేస్తున్నాయని సుఖేందర్రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అమలు చేస్తున్న ‘వివేకానంద విదేశీ విద్యా పథకం’ లబ్ధిదారులకు ఇక్కడ గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మంజూరు పత్రాలు అందజేశారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఛైర్మన్ డా. కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మండలి చైర్మన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొత్తం 133 మంది బ్రాహ్మణ విద్యార్ధుల విదేశీ చదువుకు రూ. 26 కోట్లు ఆర్థిక సాయం అందించడం అభినందనీయమని గుత్తా చెప్పారు.