Drugs Mafiaపై ఉక్కుపాదం... కాల్పుల్లో 21 మంది మృతి
ABN , First Publish Date - 2022-05-25T19:05:48+05:30 IST
రియో డీజనీరో: బ్రెజిల్ రాజధాని రియో డెజనిరోలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
రియో డీజనీరో: బ్రెజిల్ రాజధాని రియో డీజనీరోలో Drugs Mafiaపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాజధాని శివార్లలోని విలా కృజెరియోలో డ్రగ్స్ మాఫియా ముఠా సమావేశమవుతుందనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూడగానే ముఠా సభ్యులు కాల్పులకు దిగారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో 21 మంది హతమయ్యారు. గాయపడ్డ ఏడుగురిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ పోలీస్ కూడా ఉన్నారు. ఘటనాస్థలం నుంచి రైఫిళ్లు, పిస్టళ్లు, కార్లు, బైకులు స్వాధీనం చేసుకున్నారు.