బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం...

ABN , First Publish Date - 2021-04-14T13:51:05+05:30 IST

బ్రెజిల్ దేశంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది....

బ్రెజిల్‌లో కరోనా మరణమృదంగం...

ఒకేరోజు 3,808 మంది మృతి

సౌపౌలో (బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. గత 24 గంటల్లో బ్రెజిల్ దేశంలో 3,808మంది కరోనాతో మరణించారు. దీంతో బ్రెజిల్ దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,58,425కు పెరిగింది.కొత్తగా 82,186 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,599,994కు చేరింది. బ్రెజిల్ దేశంలోని ఆసుపత్రుల్లో 80 శాతం పడకలు కొవిడ్ రోగులతో నిండిపోయాయి. గత వారం రోజులుగా రోజుకు 3,068 మంది కరోనాతో మరణిస్తున్నారు.


 అమెరికా తర్వాత బ్రెజిల్ దేశంలోనే కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉంది. ఫిబ్రవరి నెల తర్వాత బ్రెజిల్ దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోనే రెండో అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా బ్రెజిల్ నిలిచింది.కరోనా మరణాల సంఖ్య పెరుగుతుండటంతో బ్రెజిల్ ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Updated Date - 2021-04-14T13:51:05+05:30 IST