Viral Video: పెళ్లయ్యాక భోజనం చేస్తుండగా వధూవరులిద్దరి చిలిపి పని.. కెమెరాలో చిక్కడంతో దొరికిపోయారిలా..!

ABN , First Publish Date - 2021-10-08T21:32:56+05:30 IST

కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మేలతాళాల మధ్య అప్పుడే పెళ్లి బంధంతో ఒక్కటైన ఓ జంటకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ మారింది. పెళ్లి పూర్తైన తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ.. ఆ నవదంపతులు ఓ చిలిపి పని చేశారు.

Viral Video: పెళ్లయ్యాక భోజనం చేస్తుండగా వధూవరులిద్దరి చిలిపి పని.. కెమెరాలో చిక్కడంతో దొరికిపోయారిలా..!

ఇంటర్నెట్ డెస్క్: కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మేలతాళాల మధ్య అప్పుడే పెళ్లి బంధంతో ఒక్కటైన ఓ జంటకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ మారింది. పెళ్లి పూర్తైన తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి కూర్చుని భోజనం చేస్తూ.. ఆ నవదంపతులు ఓ చిలిపి పని చేశారు. అదికాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు తమ జ్జాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆ జంట అప్పడే పెళ్లి బంధంతో ఒక్కటైంది. మూడు ముళ్ల బంధంతో కలిసిన నూతన వధూవరులను అక్కడికి వచ్చినవారంతా నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఈ క్రమంలో వివాహం పూర్తైన తర్వాత.. ఆ నవదంపతులు ఇద్దరూ కుటుంబ సభ్యలతో కలిసి భోజనం చేసేందుకు రెడీ అయ్యారు. ఫొటో గ్రాఫర్ అక్కడికి రావడంతో.. విస్తరిలో వడ్డించిన పదార్థాలను తింటూనే ఆ నవదంపతులు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ క్రమంలో వరుడు ఫొటో కోసం తన ముఖాన్ని కెమెరా వైపు తప్పగానే.. వధువు కొంటెపని చేసింది. 



వరడు విస్తరిలో ఉన్న పాపడను దొంగిలించి, దాని నుంచి చిన్న ముక్క కొరుక్కుతింది. ఫొటో దిగిన తర్వాత తన విస్తరికేసి చూసిన ఆ వరుడు.. అందులో పాపడ లేకపోవడంతో కాస్తా ఆశ్చర్యపోయాడు. అనంతరం తన విస్తరిలోని పాపడను తన భార్యే దొంగిలించిందని గుర్తించాడు. ఈ క్రమంలోనే ఆ వరుడు సైతం అదును చూసి, వధువు విస్తరిలోంచి తన పాపడను తాను తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. 




Updated Date - 2021-10-08T21:32:56+05:30 IST