చదువు లేని వ్యక్తిని పెళ్లి చేసుకోనని పీటల మీద చెప్పిన వధువు.. మరి, ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదనే ప్రశ్నకు ఆమె ఏం చెప్పిందంటే..
ABN , First Publish Date - 2022-04-29T19:01:24+05:30 IST
పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.. ఇరు కుటుంబాల వారు, బంధుమిత్రులు పెళ్లి మండపానికి చేరుకున్నారు..
పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.. ఇరు కుటుంబాల వారు, బంధుమిత్రులు పెళ్లి మండపానికి చేరుకున్నారు.. వధువు, వరుడు పీటల మీద కూర్చున్నారు.. ఒకరి మెడలో మరొకరు వర మాలలు వేసుకునే సమయంలో వధువు షాకిచ్చింది.. నిరక్ష్యరాస్యుడైన వ్యక్తిని తాను వివాహం చేసుకోనని తేల్చి చెప్పింది.. తాను బీఈడీ చదువుకున్నానని, చదువుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.. దీంతో పెళ్లికి హాజరైన అందరూ షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో వధూవరులు వర మాలలతో వేదికపై నిలబడి ఉన్నారు. వధువు మెడలో వరుడు వరమాల వేశాడు. ఆ తర్వాత, వధువు వరుడి మెడలో దండ వేయకుండా.. వరుడు నిరక్షరాస్యుడు కాబట్టి తాను అతడిని పెళ్లి చేసుకోనని చెప్పింది. తాను బీఈడీ చదివానని, వరుడు పూర్తిగా నిరక్షరాస్యుడని, అతనితో తాను సంతోషంగా ఉండలేనని, అందుకే అతనిని వివాహం చేసుకోలేనని చెప్పింది.
`అలాంటప్పుడు పెళ్లికి ముందే ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు కదా` అని వధువును కళ్యాణ మండపంలోని ఓ వ్యక్తి ప్రశ్నించాడు. `డబ్బు కోసం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోమని నా తండ్రి బలవంతం చేస్తున్నాడ`ని వధువు సమాధానం ఇచ్చింది. తనతో ఇంగ్లీష్లో మాట్లాడగలిగిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని వధువు చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. వేదికపై ఉన్న వరుడు ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు.