-
-
Home » Andhra Pradesh » Bride Died at marrige hall-MRGS-AndhraPradesh
-
Shocking : జీలకర్ర బెల్లం పెడుతుండగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిన వధువు..
ABN , First Publish Date - 2022-05-12T18:59:07+05:30 IST
పెళ్లి పీటలపైనే వధువు కన్నుమూసింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి...
విశాఖపట్నం : ఎన్నో.. ఎన్నెన్నో అనుకున్నారు.. పెళ్లితో (Marriage) ఒక్కటై నిండు నూరేళ్లు హాయిగా ఉందామని కలలు కన్నారు.. సినిమా రేంజ్లో ప్రీవెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు.. ఆ వీడియోలు చూసిన అందరూ చూడముచ్చని జంట అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక పెళ్లి కోసం భారీగా సెట్లు వేశారు.. బంధువులు, అతిథులతో పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. అంతా అనుకున్నట్లుగా జరిగుంటే మరికొన్ని నిమిషాల్లో ఆ జంట ఒక్కటయ్యేది.. కానీ ఇంతలోనే ఊహించని విధంగా పెళ్లి పీటల మీద ఉండగానే మృత్యువు వెంటాడింది. పెళ్లి పీటలపైనే వధువు కన్నుమూసింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని (Vizag) మధురవాడలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకెళితే.. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ-సృజనల వివాహం బుధవారం రాత్రి 7 గంటలకు జరగాల్సి ఉంది. ముహూర్తం సమయానికి అటు వరుడు.. ఇటు వధువు ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. వరుడు.. వధువు తలపైన జీలకర్ర బెల్లం పెడుతుండగా ఆమె సృహ కోల్పోయింది. ఒక్కసారిగా ఆమె పీటలపైనుంచి కింద పడిపోవడంతో అప్రమత్తమైన కుటుంబీకులు, బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆస్పత్రికి (Hospital) తరలించేలోపే వధువు సృజన తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కాగా.. ఎక్కువ అలసిపోవడం వల్ల వధువుకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.