పెళ్లి రిసెప్షన్ తర్వాత భర్తకు షాకిచ్చిన వధువు.. అర్జెంటుగా వెళుతున్నానని బయలుదేరి ఆమె ఎక్కడికి వెళ్లిందంటే..

ABN , First Publish Date - 2022-04-22T09:41:31+05:30 IST

వివాహం పేరుతో రాజస్థాన్‌లో భారీ మోసాలకు పాల్పడుతున్న నవ వధువుల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అదే రాష్ట్రంలో మరో ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ నవ వధువు రిసెప్షన్ తర్వాతి రోజు అత్తింటి వారికి షాకిచ్చింది...

పెళ్లి రిసెప్షన్ తర్వాత భర్తకు షాకిచ్చిన వధువు.. అర్జెంటుగా వెళుతున్నానని బయలుదేరి ఆమె ఎక్కడికి వెళ్లిందంటే..

వివాహం పేరుతో రాజస్థాన్‌లో భారీ మోసాలకు పాల్పడుతున్న నవ వధువుల గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అదే రాష్ట్రంలో మరో ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ నవ వధువు రిసెప్షన్ తర్వాతి రోజు అత్తింటి వారికి షాకిచ్చింది. మార్కెట్‌కు వెళుతున్నానని చెప్పి బయలుదేరిన ఆమె మళ్లీ తిరిగి రాలేదు. 


లక్ష్మీ నగర్ విష్ణు విహార్‌కు చెందిన ఓ యువకుడు ఈ నెల 15న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. మధ్యవర్తి ద్వారా ఈ వివాహం కుదిరింది. పెళ్లయిన రెండు రోజుల తర్వాత వరుడు కుటుంబ సభ్యులు రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఆ వేడుకలో వధువు చాలా ఉత్సాహంగా పాల్గొంది. మరుసటి రోజు ఉదయం ఆమె షాపింగ్ కోసం మార్కెట్ వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంత సేపటికీ తిరిగి రాలేదు. 


కుటుంబ సభ్యులు ఆమె కోసం ఎంతగానో వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. అనంతరం ఇంట్లో బీరువా తెరిచి చూడగా లోపల ఉండాల్సిన డబ్బు, నగలు మాయమయ్యాయి. మోసపోయామని అర్థం చేసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం గాలిస్తున్నారు.  


Updated Date - 2022-04-22T09:41:31+05:30 IST