పెళ్లైన నెల రోజులకే ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలు విషయం బయటపెట్టడంతో భర్త షాక్..

ABN , First Publish Date - 2022-02-25T20:51:08+05:30 IST

పెళ్లైన నెల రోజులకే నవవధువు తన భర్తకు ట్విస్ట్ ఇచ్చింది. ఫోన్ ద్వారా అసలు విషయం బయటపెట్టింది. అది విని భర్త ఒక్కసారిగా విస్తుపోయాడు. గదిలోకి వెళ్లి అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యా

పెళ్లైన నెల రోజులకే ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలు విషయం బయటపెట్టడంతో భర్త షాక్..

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లైన నెల రోజులకే నవవధువు తన భర్తకు ట్విస్ట్ ఇచ్చింది. ఫోన్ ద్వారా అసలు విషయం బయటపెట్టింది. అది విని భర్త ఒక్కసారిగా విస్తుపోయాడు. గదిలోకి వెళ్లి అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాకయ్యాడు. అనంతరం దిక్కతోచని స్థితిలో అతడు పోలీసులను ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా, దల్పత్‌పుర ప్రాంతానికి చెందిన సోహన్‌లాల్ అనే యువకుడు సాత్నా‌కు చెందిన పుష్ప దేవి అనే యువతిని సుమారు నెల రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. అయితే.. పెళ్లైన ముప్పై రోజులకు పుష్ప దేవి సంచలన విషయాన్ని బయటపెట్టింది. దినేష్ అనే వ్యక్తితో కలిసి ఇంట్లోంచి పారిపోయిన పుష్ప దేవి.. నువ్వంటే ఇష్టం లేదని సోహన్‌లాల్‌కు ఫోన్ ద్వారా చెప్పి షాక్ ఇచ్చింది. పుష్పదేవి మాటలు విని ఒక్కసారిగా విస్తుపోయిన సోహన్‌లాల్.. గదిలోకి పరుగులు తీశాడు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అవాక్కయ్యాడు. నగలు, డబ్బులు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. 



హర్దాస్, దినేష్ అనే ఇద్దరు వ్యక్తులు మధ్యవర్తిత్వం వహించి పుష్పదేవితో తనకు పెళ్లి చేసినట్టు వెల్లడించాడు. పెళ్లైన 15 రోజులకు స్మార్ట్ ఫోన్, నగలు కావాలని పుష్ప పట్టుబట్టిందని పేర్కొన్నాడు. దీంతో ఆమె కోరిన విధంగా కొత్త ఫోన్, నగలను భార్యకు అందజేసినట్టు తెలిపాడు. తాను చేయించిన నగలను తీసుకుని దినేష్‌తో పుష్ప దేవి కారులో పారిపోయిందని చెప్పాడు. వారిని అడ్డకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయిందని వివరించాడు. భార్యతో సహా తనను మోసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలని సోహన్‌లాల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




Updated Date - 2022-02-25T20:51:08+05:30 IST