మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. పెళ్లిమంటపంలో నిరీక్షిస్తున్న వరుడు.. ఆమె ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..

ABN , First Publish Date - 2022-05-21T18:06:05+05:30 IST

పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.. బంధుమిత్రులతో కలిసి వరుడు పెళ్లి మండపానికి ఊరేగింపుగా చేరుకున్నాడు..

మేకప్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు.. పెళ్లిమంటపంలో నిరీక్షిస్తున్న వరుడు.. ఆమె ఎంతకూ రాకపోవడంతో వెళ్లి చూస్తే..

పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి.. బంధుమిత్రులతో కలిసి వరుడు పెళ్లి మండపానికి ఊరేగింపుగా చేరుకున్నాడు.. వధువు తల్లిదండ్రులు వారికి ఆహ్వానం పలికారు.. అప్పటికే కల్యాణ మండపానికి చేరుకున్న వధువు బ్యూటీ పార్లర్‌కు వెళ్లి రెడీ అయి వస్తానని చెప్పి వెళ్లింది.. ఎంతసేపటికీ తిరిగి రాలేదు.. అందరూ వెతికినా కనిపించలేదు.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది.. పెళ్లికి కేవలం రెండు గంటల ముందు వధువు తన ప్రియుడితో వెళ్లిపోయిందని తెలిసింది. 

ఇది కూడా చదవండి..

భార్యకు వినూత్నంగా స్వాగతం.. పెళ్లయ్యాక మొదటిసారి అత్తారింట్లోకి ఆమె అడుగుపెడుతోంటే.. ఆ భర్త ఓ తుపాకీ తీసుకుని..


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జితేంద్ర అనే వ్యక్తికి ఎమ్‌జీ రోడ్ కాలనీకి చెందిన రోషిణీతో వివాహం నిశ్చయమైంది. గురువారం సాయంత్రం వీరి వివాహం జరగాల్సి ఉంది. గురువారం ఉదయమే వరుడి కుటుంబం కల్యాణ మండపానికి చేరుకుంది. వధువు కుటుంబం వారికి ఆహ్వానం పలికింది. పెళ్లికి రెండు గంటల సమయం ఉందనగా వధువు రోషిణి బ్యూటీ పార్లర్‌కు వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లింది. ముహూర్త సమయం దగ్గరపడుతున్నప్పటికీ ఆమె తిరిగి రాలేదు. 


వధువు కుటుంబ సభ్యలతో పాటు స్వయంగా వరుడు కూడా రోషిణి కోసం వెతికాడు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అసలు విషయం తెలిసింది. ఆకాష్ అనే వ్యక్తితో రోషిణి ప్రేమలో ఉందని, అతడితోనే వెళ్లిపోయిందని తెలిసింది. ఇద్దరి ఫోన్లూ స్విచ్ఛాఫ్ రావడంతో చేసేదేం లేక వరుడి కుటుంబం వెనుదిరిగింది.   

Updated Date - 2022-05-21T18:06:05+05:30 IST