3 నెలల క్రితం పెళ్లి.. పాలు తాగుతారా..? అంటూ మొదటి సారి భార్య అడగడంతో సరేనన్న భర్త.. తెల్లారేసరికి అత్తారింట్లో రచ్చ రచ్చ..

ABN , First Publish Date - 2022-09-02T22:04:53+05:30 IST

ఆమెకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన తర్వాత చాలా రోజులు ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది.

3 నెలల క్రితం పెళ్లి.. పాలు తాగుతారా..? అంటూ మొదటి సారి భార్య అడగడంతో సరేనన్న భర్త.. తెల్లారేసరికి అత్తారింట్లో రచ్చ రచ్చ..

ఆమెకు మూడు నెలల క్రితం వివాహం జరిగింది.. వివాహం జరిగిన తర్వాత చాలా రోజులు ఆమె పుట్టింట్లోనే ఉండిపోయింది.. ఇటీవల భారీ ఊరేగింపు మధ్య అత్తారింటికి వచ్చింది.. వచ్చిన తొలి రోజే భర్తకు పాలు కలిపి ఇచ్చింది.. అత్తమామలకు రోటీలు చేసి ఇచ్చింది.. తర్వాతి రోజు ఉదయం లేచి చూసే సరికి ఆమె ఎక్కడా కనిపించలేదు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా షాకింగ్ విషయం బయటపడింది.. దీంతో ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. 


ఇది కూడా చదవండి..

Viral Video: వీళ్ల తెలివి తెల్లారిపోనూ.. అక్రమ మద్యం రవాణాకు Bolero వాహనాన్ని వాడుతున్న తీరును చూసి ఆనంద్ మహీంద్రా సెటైర్లు..!


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని సంభాల్ నగరానికి చెందిన అంకుష్‌కి మూడు నెలల క్రితం శివపురితో వివాహం జరగింది. ఓ మధ్యవర్తి ద్వారా ఆ వివాహం కుదిరింది. పెళ్లయిన తర్వాత శివపురి ఎక్కువ కాలం పుట్టింట్లోనే ఉండిపోయింది.. ఇటీవల తల్లిదండ్రుల బలవంతం మీద అత్తారింటికి వెళ్లింది.. తొలిరోజే భర్తకు పాలు కలిపి ఇచ్చింది.. అలాగే అత్తమామలకు రోటీలు చేసి ఇచ్చింది. భర్తకు ఇచ్చిన పాలలోనూ, అత్తమామలకు ఇచ్చిన రోటీలలోనూ నిద్ర మాత్రలు కలపడంతో వారు ఆ రాత్రి గాఢంగా నిద్రపోయారు. వారు నిద్రపోయాక శివపురి తన ప్రియుడితో (Bride ran away with lover) కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. 


తర్వాతి రోజు ఉదయం అంకుష్, అతని తల్లిదండ్రులు నిద్ర లేచి చూసే సరికి శివపురి ఎక్కడా కనిపించలేదు. బీరువాలో రూ.70 వేల నగదు, లక్ష రూపాయల విలువైన నగలు మాయమయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా శివపురి ఓ యువకుడితో వెళ్లిపోయినట్టు కనిపించింది. దీంతో అంకుష్ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు.   

Updated Date - 2022-09-02T22:04:53+05:30 IST