వంతెన పనులను త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2022-05-23T04:04:20+05:30 IST
సుబ్బరాంపల్లి, నారాయ ణపూర్ గ్రామాల మధ్య వాగుపై రూ.4.80 కోట్లతో నిర్మిస్తున్న వంతెన, రూ.5.89 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ బాల్క సుమన్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించా రు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామా లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు.
చెన్నూరురూరల్, మే 22: సుబ్బరాంపల్లి, నారాయ ణపూర్ గ్రామాల మధ్య వాగుపై రూ.4.80 కోట్లతో నిర్మిస్తున్న వంతెన, రూ.5.89 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను ఆదివారం చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభు త్వ విప్ బాల్క సుమన్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించా రు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామా లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ తిరుపతి, వైస్ ఎంపీపీ బాపురెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సమ్మయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దా మోదర్రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సమ్మి రెడ్డి, సర్పంచు రాకేష్గౌడ్, ఎంపీటీసీ పాల్గొన్నారు.
చెల్లాయిపేట సర్పంచు డెబ్బ రవీందర్ తండ్రి మధునయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా కుటుంబీకులను బాల్క సుమన్ పరామర్శించారు.
భీమారం: మండల కేంద్రంలో రూ.10 లక్షలతో నిర్మించే యాదవ కమ్యూనిటీ హాలు, రూ. 5 లక్షలతో మల్లన్న దేవాలయం, రూ.10 లక్షలతో నిర్మించే బంజారాల కమ్యూనిటీ హాలు పనులకు ఎమ్మెల్యే సుమన్ శంకుస్ధాపన చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్నారు. యాదవులకు మూడు విడతల్లో గొర్రెలను పంపిణీ చేశామని, రానున్న రోజుల్లో మిగిలిన వారికి గొర్రెలు, మేకలను పంపిణీ చేస్తామన్నారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు జరుగుతున్నాయని, కూడళ్లలో సుందరీకరణ పనులు చేస్తామన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు రాజ్కుమార్, రైతుబంధు కో ఆర్డినేటర్ మహేశ్వర్రెడ్డి, నాయకులు పర్వతాలు, మహేష్, రాజ్కుమార్, గోపి, పొడేటి రవి, దాసరి మధునయ్య, పాల్గొన్నారు.
కన్నెపల్లి: రెబ్బెనలో టీఆర్ఎస్ యువ నాయకులు గట్టు ప్రమోద్ గౌడ్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా ఆదివారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, బెల్లంపల్లి ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్యలు ప్రమోద్గౌడ్ ఇంటికి వెళ్లి పరామర్శిం చారు. జడ్పీటీసీ కౌటారపు సత్యనారా యణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగారావు ఉన్నారు.