bike rally: ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ ప్రారంభం... పాల్గొన్న కిషన్ రెడ్డి
ABN , First Publish Date - 2022-09-15T16:45:20+05:30 IST
బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. గురువారం ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) బైక్ నడుపుతూ బైక్ ర్యాలీని ప్రారంభించారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పెరెడ్ గ్రౌండ్స్ మీదుగా అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ సాగనుంది. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాల్లో భాగంగా మహిళల బైక్ ర్యాలీ చేపట్టారు. అమృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరుపున వివిధ కార్యక్రమాలు బీజేపీ (BJP) నిర్వహిస్తోంది. అంతుకుముందు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న కిషన్ రెడ్డి (union minister) .. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.