కొవిడ్ నిబంధనలు ఉల్లంఘన.. బ్రిటన్ ప్రధాని, ఆర్థిక మంత్రికి జరిమానా!
ABN , First Publish Date - 2022-04-13T03:22:45+05:30 IST
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్లకు అధికారులు జరిమానా విధించబోతున్నారు
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషి సునక్లకు అధికారులు జరిమానా విధించబోతున్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వీరిద్దరికీ మెట్రోపాలిటన్ పోలీసులు ఫిక్స్డ్ పెనాల్టీ నోటీసులు పంపించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వీరిద్దరికీ ఫిక్స్డ్ పెనాల్టీ నోటీసులు పంపబోతున్నట్టు నోటీసులు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, ఇంతకుమించి వివరాలేవీ తెలియరాలేదన్నారు.
ఈ జరిమానాలు లాక్డౌన్ సమయంలో డౌనింగ్ స్ట్రీట్లో జరిగిన పార్టీలకు సంబంధించినవి తెలుస్తోంది. అలాగే, జూన్ 2020లో ప్రధాని జాన్సన్ పుట్టిన రోజు సందర్భంగా కేబినెట్ రూములో జరిగిన సమావేశాన్ని కూడా ఈ ఫైన్లో చేర్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.