కేరళలో విరిగిన కొండచరియలు

ABN , First Publish Date - 2020-08-09T09:09:58+05:30 IST

కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో ఇడుక్కి జిల్లాలోని పెట్టుమూడి టీ ఎస్టేట్‌ కార్మికుల ఇళ్లపై శుక్రవారం

కేరళలో విరిగిన కొండచరియలు

  • 24కు చేరిన మృతులు.. 46 మంది గల్లంతు

ఇడుక్కి, ఆగస్టు 8: కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. ఎడతెరిపి లేని వర్షాలతో ఇడుక్కి జిల్లాలోని పెట్టుమూడి టీ ఎస్టేట్‌ కార్మికుల ఇళ్లపై శుక్రవారం కొండచరియలు విరిగిపడ్డాయి. పోలీసులు, ఫైర్‌ సిబ్బంది, జాతీయ విప త్తు స్పందన బలగాలు జోరు వానలోనే సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 12మందిని రక్షించగా, 46 మంది ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు.

Updated Date - 2020-08-09T09:09:58+05:30 IST