మాట్లాడేందుకు వచ్చిన బావమరిదిపై దాడి

ABN , First Publish Date - 2021-03-20T16:23:11+05:30 IST

సోదరితో గొడవపడుతున్నాడని తెలుకుని మాట్లాడేందుకు వచ్చిన బావమర్దిపై

మాట్లాడేందుకు వచ్చిన బావమరిదిపై దాడి

హైదరాబాద్/చాదర్‌ఘాట్‌ : సోదరితో గొడవపడుతున్నాడని తెలుకుని మాట్లాడేందుకు వచ్చిన బావమర్దిపై దాడి చేసిన ఘటన మలక్‌పేట పరిధిలో చోటుచేసుకుంది. మౌసిన్‌ అలియాస్‌ ఫిరోజ్‌ (40), భార్యా, తల్లితో కలిసి ముసారాంబాగ్‌ చౌరస్తాలోని ఎస్‌బీఐ ముం దున్న పుట్‌పాత్‌పైనే ఉంటూ చౌరస్తాలో భిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులుగా మౌసిన్‌ తన భార్యతో గొడవ పడుతూ చంపేస్తానని బెదిరిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు హబీబ్‌  శుక్రవారం రాత్రి మాట్లాడేందుకు మౌసిన్‌ వద్దకు వచ్చాడు. వారి మధ్య వాగ్వాదం జరిగింది. మౌసిన్‌ బావమరిది హబీబ్‌పై దాడి చేయడంతో గాయాలు అయ్యాయి. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-03-20T16:23:11+05:30 IST