అవిశ్వాసం పెట్టినా అభ్యంతరం లేదు : యడియూరప్ప

ABN , First Publish Date - 2020-09-26T20:13:34+05:30 IST

యడియూరప్ప సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అవిశ్వాసం పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి

అవిశ్వాసం పెట్టినా అభ్యంతరం లేదు : యడియూరప్ప

బెంగళూరు : యడియూరప్ప సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అవిశ్వాసం పెట్టాలని యోచిస్తోంది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పీకర్ కు నోటీసులిచ్చారు. కరోనా నియంత్రణలో యడియూరప్ప సర్కార్ పూర్తిగా విఫలమైందని, అవినీతిలో కూరుకుపోయిందని, ఆర్థికాభివృద్ధి కూడా లేదని ఆయన విమర్శించారు. వీటన్నింటితో కర్నాటక రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని అన్నారు.


గత వారంలో ఓ కేంద్ర మంత్రిని, ఓ రాజ్యసభ ఎంపీని, ఓ ఎమ్మెల్యేను కోల్పోయామని, కరోనా సమయంలో రాష్ట్రంలో 2,000 కోట్ల అవినీతి జరిగిందని సిద్దరామయ్య ఆరోపించారు. అయితే ఈ విమర్శలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అవిశ్వాసం అనేది ఓ ‘రాజీకయ జిమ్మిక్కని’ మండిపడింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం కూడా లేదని, అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.


‘‘అవిశ్వాసం పెట్టినా అభ్యంతరం లేదు.’’ అని ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. ‘‘నాకేమీ అభ్యంతరం లేదు. ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టమనండి. ప్రతి ఆర్నెళ్లకోసారి అవిశ్వాసం అంటారు. మరో ఆరు నెలల పాటు నేను సేఫ్ గా ఉంటాను’’ అని యడియూరప్ప స్పష్టం చేశారు. 

Updated Date - 2020-09-26T20:13:34+05:30 IST