Gujarat సముద్ర తీరంలో BSF దాడి...4 పాక్ పడవల సీజ్

ABN , First Publish Date - 2022-07-07T17:11:17+05:30 IST

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ సరిహద్దులోని సముద్రతీరంలో నలుగురు పాకిస్థానీ మత్స్యకారులను బీఎస్ఎఫ్....

Gujarat సముద్ర తీరంలో BSF దాడి...4 పాక్ పడవల సీజ్

నలుగురు మత్స్యకారుల అరెస్ట్ 

కచ్ (గుజరాత్):గుజరాత్ రాష్ట్రంలోని కచ్ సరిహద్దులోని సముద్రతీరంలో నలుగురు పాకిస్థానీ మత్స్యకారులను బీఎస్ఎఫ్ (BSF) పట్టుకుంది.బీఎస్ఎఫ్ జవాన్లు 10 పడవలను స్వాధీనం చేసుకున్నారు. కచ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని హరామి నల్లా వద్ద నలుగురు పాకిస్థాన్ మత్స్యకారులను పట్టుకున్నారు.సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) భుజ్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీపీ నంబర్ 1165, 1166 మధ్య కొన్ని పాకిస్థానీ ఫిషింగ్ బోట్లు భారత భూభాగంలోకి చొరబడుతున్నప్పుడు వాటి కదలికలను గమనించింది. ఆ తర్వాత పాక్ పడవలను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు.వెంటనే బీఎస్ఎఫ్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ ప్రాంతంలో అన్వేషణ సాగుతోంది.స్వాధీనం చేసుకున్న పడవలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు.


Updated Date - 2022-07-07T17:11:17+05:30 IST