బీఎ్‌సఎన్‌ఎల్‌కూ 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలి

ABN , First Publish Date - 2022-03-22T08:27:06+05:30 IST

ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌కూ ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించినట్లుగానే 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని...

బీఎ్‌సఎన్‌ఎల్‌కూ 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలి

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బీఎ్‌సఎన్‌ఎల్‌కూ ప్రైవేట్‌ సంస్థలకు కేటాయించినట్లుగానే   5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించాలని పార్లమెంట్‌ స్థాయీ సంఘం కోరింది. అంతేకాకుండా ఇందుకు అవసరమైన యంత్ర పరికరాల కొనుగోలులోనూ కంపెనీకి స్వేచ్ఛ ఉండాలని స్పష్టం చేసింది. అప్పుడే బీఎ్‌సఎన్‌ఎల్‌.. ప్రైవేట్‌ సంస్థలతో సమానంగా పోటీ చేయగలుగుతుందని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ నాయకత్వంలోని పార్లమెంట్‌ స్థాయీ సంఘం తేల్చిచెప్పింది. కాగా మరో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ ఎంటీఎన్‌ఎల్‌కు ఉన్న రూ.26,500 కోట్ల అప్పులు, ఆస్తులను స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ)కు బదిలీ చేసి.. ఎంటీఎన్‌ఎల్‌ను బీఎ్‌సఎన్‌ఎల్‌లో విలీనం చేయాలని సిఫారసు చేసింది. అలాగే 4జీ సేవల ద్వారా బీఎ్‌సఎన్‌ఎల్‌ ఆదాయం మెరుగుపడి ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Updated Date - 2022-03-22T08:27:06+05:30 IST