బీఎస్పీ సభ్యత్వ నమోదు లాంఛనంగా ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-27T02:48:14+05:30 IST

విజయవాడ: బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ సిటీ కమిటీ, కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు.

బీఎస్పీ సభ్యత్వ నమోదు లాంఛనంగా ప్రారంభం

విజయవాడ: బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ సిటీ కమిటీ, కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి పుష్పరాజు, కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొదమల ప్రభుదాస్, సిటీ కన్వీనర్ మద్దిరాల వినోద్, జిల్లా ఇన్‌ఛార్జ్ ఉడుముల బుజ్జి ప్రారంభించారు. 50 మందికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. 2024లో జరిగే ఎన్నికల్లో బహుజన రాజ్యధికారం ధ్యేయంగా పనిచేస్తామని నేతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు అధ్యక్షుడు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు బాబురావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి మురళీ, సెక్రటరీ తడకమళ్ళ వెంకటేశ్వరరావు, జిల్లా ట్రజర్రర్ రమేష్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు దూలం రాము, సెక్రటరీ సీలం వినయ్, సిటీ మూడు నియోజకవర్గాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T02:48:14+05:30 IST