Tirumalaలో రాజకీయాలు మాట్లాడతారా?: బీటెక్ రవి
ABN , First Publish Date - 2022-05-20T01:44:32+05:30 IST
పవిత్రమైన తిరుమల (Tirumala)లో మంత్రి రోజా రాజకీయాలు మాట్లాడటం శోచనీయమని ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల: పవిత్రమైన తిరుమల (Tirumala)లో మంత్రి రోజా రాజకీయాలు మాట్లాడటం శోచనీయమని ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమలకు ఎంతో పవిత్రత ఉంది. ఇక్కడ రాజకీయాలేవీ మాట్లాడకూడదు. కామన్సెన్స్ ఉన్న ఏ నేత కూడా రాజకీయాల గురించి మాట్లాడరు. కానీ రోజా ఎప్పుడు చూసినా ఇక్కడే రాజకీయాలు మాట్లాడతారు. రాజకీయాలు మాట్లాడటానికి అనేక రకాల వేదికలున్నాయి. ఇక్కడ నుంచి రాజకీయ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. తిరుమల పవిత్రతను కాపాడలని ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నా’’ అన్నారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ర్టాన్ని ఎలాగైనా గట్టెక్కించాలని స్వామివారిని కోరుకున్నట్టు బీటెక్ రవి తెలిపారు.