corruption case: బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష
ABN , First Publish Date - 2022-07-26T17:17:47+05:30 IST
అక్రమాల కేసులో(corruption case) బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ...
ఐజ్వాల్(మణిపూర్): అక్రమాల కేసులో(corruption case) బీజేపీ ఎమ్మెల్యేకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మిజోరం(Mizorams) ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.అవినీతి కేసులో మిజోరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే (lone BJP MLA) బుద్ధధన్ చక్మాతో(Buddha Dhan Chakma) పాటు మరో 12 మంది నేతలకు ప్రత్యేక కోర్టు ఏడాది( one year) జైలు శిక్ష(sentenced jail) విధించింది.2013, 2018 మధ్యకాలంలో చక్మా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (CADC)కి చెందిన రూ.1.37 కోట్లను దుర్వినియోగం చేసినందుకు గాను టుయిచాంగ్ శాసనసభ్యుడితో సహా 13 మందికి ప్రత్యేక న్యాయమూర్తి వన్లాలెన్మావియా ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 13(1) (డి) ప్రకారం వారి అధికారాలను దుర్వినియోగం చేసి, అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక సహాయ నిధి నుంచి డబ్బును ఉపసంహరించుకున్నందుకు కోర్టు వారిని జులై 22న దోషులుగా నిర్ధారించింది.
నిధుల దుర్వినియోగం కేసు
ఇతర దోషులు సీఏడీసీ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బుద్ధ లీలా చక్మా, ఇద్దరు ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఇద్దరు సిట్టింగ్ సభ్యులు, ముగ్గురు మాజీ సీఈఎంలు, నలుగురు దక్షిణ మిజోరాంలోని లాంగ్ట్లై జిల్లాలోని మాజీ కార్యనిర్వాహక సభ్యులను కోర్టు దోషులుగా తేల్చింది.అవినీతి జరిగినప్పుడు వీరంతా సీఏడీసీలో సభ్యులుగా ఉన్నారు.కోర్టు ఒక్కొక్కరికి రూ.10,000 జరిమానా కూడా విధించింది.జరిమానా చెల్లించని పక్షంలో మరో 30 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.విచారణ ముగిసిన వెంటనే తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని వారి న్యాయవాది చేసిన విజ్ఞప్తి మేరకు కోర్టు దోషులను బెయిల్పై విడుదల చేసింది.అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ చక్మా కౌన్సిల్ను రద్దు చేయాలని 2017లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వన్లాల్ముకా గవర్నర్ను కోరారు.
ఎమ్మెల్యే అవినీతిపై ఏసీబీ కేసు
దీని తర్వాత గవర్నర్ లాంగ్ట్లై అప్పటి డిప్యూటీ కమిషనర్ ముత్తమ్మను ఈ విషయంపై విచారణ చేయవలసిందిగా కోరారు. డీసీ తన నివేదికను గవర్నర్కు సమర్పించిన తర్వాత 2018లో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది.చక్మా తరువాత కాంగ్రెస్ టిక్కెట్పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి లాల్ థన్హావ్లా ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నలుగురు చక్మా విద్యార్థులకు మెడికల్ సీట్లు నిరాకరించడాన్ని నిరసిస్తూ 2017లో రాజీనామా చేశారు.రాజీనామా చేసిన వెంటనే బీజేపీలో చేరి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్రానికి చెందిన తొలి బీజేపీ ఎమ్మెల్యే చక్మానే.