ఆ విషయం చెప్పి వైసీపీలో చేరాల్సింది.. : బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2020-07-14T18:45:31+05:30 IST

టీడీపీ ఎమ్మెల్సిలు పోతుల సునీత, శివనాథ రెడ్డిల అనర్హత పిటిషన్‌లపై నేడు మండలి ఛైర్మన్ వద్ద విచారణ జరగనుంది.

ఆ విషయం చెప్పి వైసీపీలో చేరాల్సింది.. : బుద్దా వెంకన్న

అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథ రెడ్డిల అనర్హత పిటిషన్‌లపై నేడు మండలి ఛైర్మన్ వద్ద విచారణ జరగనుంది. టీడీపీ తరపున బుద్దా వెంకన్న, అశోక్ బాబు విచారణకు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బుద్దా.. పోతుల, శివనాథపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరవ వాయిదాకి కూడా ఆరోగ్య కారణాలు చూపుతూ వారు హాజరుకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వస్తే పార్టీ మారినట్టు ఒప్పుకోవాల్సి వస్తుందని.. అందుకే కుంటి సాకులతో బయపడి రావడంలేదన్నారు. వైసీపీ ఆశయాలు నచ్చి వెళితే ఆ విషయం ఛైర్మన్‌కు వచ్చి చెప్పి చేరాల్సిందని బుద్దా చెప్పుకొచ్చారు. ప్రతి వాయిదాకు వాళ్లు హాజరవ్వకుండా లాయర్లును పంపడం కరెక్ట్ కాదన్నారు. వచ్చే వాయిదాలో పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని బుద్దా వెంకన్న మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2020-07-14T18:45:31+05:30 IST