సీఎం జగన్కు బుద్ధప్రసాద్ లేఖ
ABN , First Publish Date - 2021-07-16T01:54:08+05:30 IST
సీఎం జగన్కు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ లేఖ రాశారు. తెలుగు అకాడమీ
అమరావతి: సీఎం జగన్కు మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ లేఖ రాశారు. తెలుగు అకాడమీ పేరు మార్పును పార్టీలు వ్యతిరేకించాయని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు పెద్దఎత్తున వ్యతిరేకించారన్నారు. అకాడమీ పేరు మార్పును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మండలి డిమాండ్ చేశారు. తెలుగు అకాడమీని యథావిధిగా కొనసాగించాలని మండలి బుద్ధప్రసాద్ కోరారు.