బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు
ABN , First Publish Date - 2022-02-01T22:25:43+05:30 IST
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23లో తెలుగు రాష్ట్రాల్లోని 974 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్ల కేటాయించారు..
హైదరాబద్: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2022-23లో తెలుగు రాష్ట్రాల్లోని 974 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 44 కోట్ల కేటాయించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.56 కోట్లు, హైదరాబాద్లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థకు రూ.374.35 కోట్లు, హైదరాబాద్లోని ఐఐటికి రూ.300కోట్లు, విశాఖ పెట్రోల్ యూనివర్శిటీకి రూ.150 కోట్లు, ఏపీ సెంట్రల్ యూనివర్సిటీకి రూ.50 కోట్ల కేటాయింపులు చేశారు.