వైసీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజలకు వివరించండి : బుద్ధప్రసాద్
ABN , First Publish Date - 2021-11-25T06:37:56+05:30 IST
దేవాలయం లాంటి శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించాల్సిందిపోయి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సిగ్గుచేటటని మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ అన్నారు.
కోడూరు, నవంబరు 24 : దేవాలయం లాంటి శాసనసభలో ప్రజా సమస్యలు చర్చించాల్సిందిపోయి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సిగ్గుచేటటని మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరులో మండల స్థాయి టీడీపీ సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. వైసీపీ పాలన అంతా దుర్మార్గంగా ఉందన్నారు. వేలాది ఎకరాల పంటలు నీటమునిగి రైతులు ఇబ్బందులు పడుతుంటే కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు బండే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటరీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బడే భావాన్నారాయణ, మాజీ డీసీ చైర్మన్ పాలేటి జగన్మోహనరావు, మాజీ డీసీ వైస్ ఛైర్మన్ కాగిత రామారావు, మాజీ ఎంపిటిసి తోట సాంబయ్య, బడే వీరబాబు, కడవకొల్లు నాంచారయ్య, ఉప్పాల పోతురాజు, అండ్రాజు సుబ్బారావు, బడే గాంధీ, తోట రాంబాబు, చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.