AP NEWS: వైసీపీ పాలనలో మెరుగైన ఆర్ధిక నిర్వహణ: మంత్రి బుగ్గన
ABN , First Publish Date - 2022-09-24T01:30:30+05:30 IST
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ మెరుగైన ఆర్ధిక నిర్వహణలో ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాద్రెడ్డి అన్నారు.
అమరావతి: వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చాక ఏపీ మెరుగైన ఆర్ధిక నిర్వహణలో ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాద్రెడ్డి (Buggana Rajendranad Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ లావాదేవీల నిబద్ధతను కాగ్ ప్రశ్నించలేదన్నారు.విధానపరమైన అభ్యంతరాలనే కాగ్ వ్యక్తం చేసిందన్నారు.విధానపరమైన జాప్యాలకు హడావుడిగా ఏర్పాటైన CFMS కారణమని చెప్పారు.టీడీపీ(TDP) హయాంలో విద్యుత్ సంస్థలకు స్థానిక సంస్థలు బకాయి చెల్లించలేదన్నారు.రాష్ట్ర విభజన, కొవిడ్ మహమ్మారి వల్లే ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన్నదని మంత్రి బుగ్గన రాజేంద్రనాద్రెడ్డి తెలిపారు.