నవభారత నిర్మాణం ఉత్తుత్తి నినాదం కాకూడదు
ABN , First Publish Date - 2022-08-14T08:43:49+05:30 IST
నవభారత నిర్మాణం అనేది ఉత్తుత్తి నినాదంగా మిగిలిపోరాదని, చిత్తశుద్ధితో సాధనకు కృషిచేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు.
‘గీతం’ వ్యవస్థాపక దినోత్సవంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి
ఎండాడ (విశాఖపట్నం), ఆగస్టు 13: నవభారత నిర్మాణం అనేది ఉత్తుత్తి నినాదంగా మిగిలిపోరాదని, చిత్తశుద్ధితో సాధనకు కృషిచేయాలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం జిమ్సర్ (గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్్స అండ్ రీసెర్చ్)లోని యల్లాప్రగడ సుబ్బారావు ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థికి ‘గీతం ఫౌండేషన్ అవార్డు’ను గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అందించారు. జ్ఞాపికతోపాటు రూ.10 లక్షల నగదు అందజేశారు. కార్యక్రమంలో కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ కొవిడ్ తర్వాత ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారు తమ పిల్లలను విక్రయించడం, బాల కార్మికులుగా మార్చడం ఆందోళన కలిగించిందన్నారు. ‘గీతం’ అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవటం తదితరులు పాల్గొన్నారు.