‘10వ తేదీ లోపు భవనాలు పూర్తవ్వాలి’
ABN , First Publish Date - 2021-11-29T05:05:25+05:30 IST
లోకాయుక్త భవన నిర్మాణ పనులు డిసెంబరు 10 నాటికి పూర్తి చేసి అప్పజెప్పాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), నవంబరు 28: లోకాయుక్త భవన నిర్మాణ పనులు డిసెంబరు 10 నాటికి పూర్తి చేసి అప్పజెప్పాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఆదివారం కలెక్టర్తో పాటు లోకాయుక్త సంస్థ చైర్మన్ జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కర్నూలు-హైదరాబాదు జాతీయ రహదారి ఆనుకుని ఉన్న సంతోష్ నగర్లో లోకాయుక్త సంస్థ కార్యాలయం భవనంలో లోకాయుక్త సంస్థ చైర్మన్ చాంబర్, కోర్టు హాలు, వీడియో కాన్ఫరెన్స్ హాల్ పనులను వారు పరిశీలించారు. కలెక్టర్ వెంట డీఆర్వో పుల్లయ్య, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.