గుజరాత్లోనూ రంగంలోకి బుల్డోజర్లు
ABN , First Publish Date - 2022-04-16T08:36:20+05:30 IST
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాత గుజరాత్లోనూ బుల్డోజర్లను రంగంలోకి దింపారు.
వడోదర/భోపాల్, ఏప్రిల్ 15: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాత గుజరాత్లోనూ బుల్డోజర్లను రంగంలోకి దింపారు. రామనవమి సందర్భంగా గుజరాత్ సహా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన శోభాయాత్రలపై పలువురు దుండగులు రాళ్లదాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గుజరాత్లోని ఆనంద్, ఖంబాత్ జిల్లాలో రాళ్లదాడికి పాల్పడిన వారి కబ్జాలను అధికారులు తొలగించే ప్రక్రియ చేపట్టారు. శుక్రవారం ఆనంద్ జిల్లాలోని సకార్పుర ప్రాంతం, ఖంబాత్లో పలు కబ్జాలను అధికారులు తొలగించారు.