శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం
ABN , First Publish Date - 2021-03-04T11:54:56+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది.
హైదరాబాద్/శంషాబాద్ రూరల్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన నాగేశ్వర్రావు, పద్మ దంపతులు మంగళవారం అమెరికాకు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారి లగేజీని స్కానింగ్ చేయగా బ్యాగులో 22 ఎంఎం బుల్లెట్ ఉన్నట్టు గుర్తించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే ఆర్జీఐఏ పోలీసులకు వాటిని అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విజయ్కుమార్ తెలిపారు.